News September 16, 2024

సీతారామ ప్రాజెక్ట్ కాలువలో పడి ఇద్దరూ చిన్నారులు మృతి

image

ప్రమాదవశాత్తు సీతారామ ప్రాజెక్ట్ కాలువలో పడి ఇద్దరూ చిన్నారులు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలంలో చోటుచేసుకుంది. బుగ్గపాడు సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ వద్దకు ఈతకు వెళ్లిన జితేంద్ర సాయి (4వ తరగతి), శశాంక్ (3వ తరగతి) ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 26, 2026

వెలుగుమట్ల భూదాన్ భూములపై కలెక్టర్ వివరణ

image

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. సుమారు రూ.250 కోట్ల విలువైన భూమిని రక్షించామని, అర్హులైన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

News February 26, 2026

ఖమ్మం: ఉపసర్పంచ్ పదవికి సర్పంచ్ భార్య రాజీనామా

image

తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెం ఉపసర్పంచ్ కుంభం యమున తన పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భర్త ఉపేందర్ సర్పంచ్‌గా, భార్య యమున ఉపసర్పంచ్‌గా ఎన్నికై భార్యాభర్తలు గ్రామాన్ని ఏలుతూ వార్తల్లో నిలిచారు. అయితే వ్యక్తిగత కారణాలతో బుధవారం ఎంపీడీవో సిలార్ సాహెబ్‌కు ఆమె రాజీనామా పత్రాన్ని అందజేశారు. కేవలం మూడు నెలలకే రాజీనామా చేయడం మండలంలో చర్చనీయాంశమైంది.

News February 26, 2026

క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, హన్మకొండ, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఖమ్మం డీవైఎస్‌వో సునీల్ రెడ్డి తెలిపారు. 2017 సెప్టెంబర్ 1 నుండి 2018 ఆగస్టు 31 మధ్య జన్మించిన విద్యార్థులు మార్చి 4లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలకు 96036 49969 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.