News September 16, 2024

బంగ్లాతో టెస్టు.. గెలిచేదెవరో?

image

బంగ్లాదేశ్‌తో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగే తొలి టెస్టులో స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్ జట్టులో ఆడతారని పీటీఐ పేర్కొంది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో గెలిచేదెవరో కామెంట్ చేయండి.

Similar News

News September 19, 2024

లడ్డూ విషయంలో దేవుడు క్షమించడు: బండి

image

లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం అంటే తిరుమల శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని కేంద్రమంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. హిందువులకు జరిగిన ఈ ద్రోహాన్ని దేవుడు క్షమించడని అన్నారు. ఈ లడ్డూ వ్యవహారంలో AP ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

News September 19, 2024

జానీ మాస్టర్ దేశం కోసం ప్రాణాలైనా ఇస్తారు: భార్య సుమలత

image

TG: తన భర్త జానీ మాస్టర్‌పై వస్తున్న అత్యాచార ఆరోపణలు అవాస్తవమని ఆయన భార్య సుమలత అన్నారు. ఆయనపై కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ‘లవ్ జిహాదీ అని ఏదేదో అంటున్నారు. నా భర్త అలాంటి వ్యక్తి కాదు. ఆరోపణలు రుజువైతే జానీని వదిలేసి వెళ్తా. ఆ అమ్మాయికి చాలామందితో అఫైర్ ఉంది. అవార్డ్ వచ్చినప్పటి నుంచి కావాలనే జానీని టార్గెట్ చేశారు. దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తి నా భర్త.’ అని ఆమె పేర్కొన్నారు.

News September 19, 2024

భారత చెస్ జట్లు అదుర్స్!

image

చెస్ ఒలింపియాడ్‌ -2024లో భారత చెస్ జట్లు అదరగొడుతున్నాయి. టోర్నీ ప్రథమార్థం తర్వాత ఓపెన్, మహిళల జట్లూ అజేయంగా నిలిచి మొదటిస్థానంలో నిలిచాయి. రెండు జట్లూ వరుసగా చైనా, జార్జియాను ఓడించి 14 మ్యాచ్ పాయింట్లను సాధించాయి. ఇంకా నాలుగు రౌండ్‌లు మిగిలి ఉండగా, రెండు విభాగాల్లోనూ ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. మరిన్ని విజయాలు భారత్ కైవసం కావాలని నెటిజన్లు కోరుతున్నారు.