News September 16, 2024

విశాఖ-దుర్గ్ వందేభారత్ టైమింగ్స్ ఇవే

image

విశాఖ నుంచి దుర్గ్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్‌తో దుర్గ్‌లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్‌తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.

Similar News

News October 15, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఇక నుంచి వారు జిల్లా కార్యకలాపాల్లో భాగస్వామ్యం కానున్నారు.

News October 15, 2024

విజయనగరం జిల్లాలో మద్యం లాటరీలో నిరాశలు

image

➤ విజయనగరం జిల్లాలో ఓ సిండికేట్‌ 500కు పైగా దరఖాస్తులు వేశారు.
➤ వారు దరఖాస్తులకు రూ.10 కోట్లు పెట్టారు.
➤ వారికి దక్కింది మాత్రం 8 షాపులే..!
➤ టీడీపీ నేత 25 దరఖాస్తులు వేశారు.
➤ ఆయకు ఒకే ఒక్క షాపు తగిలింది.
➤ వైసీపీ నేత 50 దరఖాస్తులు వేశారు.
➤ అతనికి మూడు షాపులు వచ్చాయి.

News October 15, 2024

విజయనగరం కళలకు పుట్టినిళ్లు: హోం మంత్రి

image

విజయనగరం కళలకు పుట్టినిల్లు అని రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి వంగలపూడి అనిత కొనియాడారు. రెండురోజులపాటు ఘనంగా నిర్వహించిన విజయనగరం ఉత్సవాల ముగింపు సభలో సోమవారం రాత్రి హోమ్ మంత్రి మాట్లాడారు. విజయనగరం ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. నగరంలో ఏ మూల చూసినా కళా ప్రదర్శనలతో కోలాహలంగా ఉందని అన్నారు. ఘంటసాల, సుశీల లాంటి ఎంతోమంది ప్రఖ్యాతి పొందిన కళాకారులు ఇక్కడ నుంచే వచ్చారన్నారు.