News September 17, 2024
ప్రభుత్వానికి 100 రోజులు.. రేపు NDA శాసనసభా పక్ష భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరగనుంది. ఈ భేటీకి dy.cm పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేస్తున్నారు.
Similar News
News November 10, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* ఏలూరు(D) జంగారెడ్డిగూడెంలో దివంగత సింగర్ ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆయన కుమారుడు చరణ్ ఆవిష్కరించారు.
* PPP విధానంలో ప్రజలపై భారం పడకుండా పలు కీలక రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.2,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
* పట్టణాల్లోని వ్యాపార భవనాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ECBC) అమలులో దేశంలోనే AP అగ్రస్థానంలో నిలిచింది.
News November 10, 2025
నేటి నుంచి ‘స్వామిత్వ’ గ్రామసభలు

APలో <<18165882>>స్వామిత్వ<<>>(SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలకు అర్హులైన యజమానులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ముందు అభ్యంతరాలకు స్వీకరణ చేయనుంది. ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 22 వరకు గ్రామ సభలు నిర్వహించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.
News November 10, 2025
మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచిన ప్రభుత్వం

AP: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ, యూజీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. 2020-23 బ్లాక్ పీరియడ్లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10%, సూపర్ స్పెషాలిటీ, పీజీ కోర్సులకు 15% పెంపునకు ఆమోదం తెలిపింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తుదితీర్పులకు లోబడి ఇది ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు రూ.17.25 లక్షలుగా ఫీజును నిర్ధారించింది.


