News September 17, 2024
కొత్తగూడెం: గోదావరి వద్ద గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పవిత్ర గోదావరిలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వాహనంపై నుంచి విగ్రహం కిందకి దింపుతుండగా విగ్రహం జారీ కింద పడింది. ఈ ఘటనలో స్విమ్మర్ రాజేశ్కు గాయాలయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి అంబులెన్సులో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 3, 2024
ఖమ్మం: డయల్-100కు ఎన్ని కాల్స్ వచ్చాయంటే.?
సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100కు పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,511 కాల్స్ వచ్చినట్లు CP సునీల్ దత్ తెలిపారు. వీటిపై 81 FIRలు నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-2, దొంగతనాలు-9, సాధారణ ఘాతాలు-26, యాక్సిడెంట్లు-11, అనుమానాస్పద మరణాలు-10, ఇతర కేసులు-23 అన్నారు. ఫేక్ కాల్స్ చేయవద్దని, అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్ చేయాలన్నారు.
News October 3, 2024
కొత్తగూడెం: ధ్రువపత్రాల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
డీఎస్సీ-2024 అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాలలో డీఎస్సీ 2024 కు 1:3 నిష్పత్తిలో ఎన్నికైన అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన సరళిని కలెక్టర్ పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్న తక్షణమే నివృత్తి చేస్తూ సానుకూల వాతావరణంలో పరిశీలన పూర్తి చేయాలని అధికారులను సూచించారు.
News October 3, 2024
గ్రామాల్లో ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న పూల పండుగ(బతుకమ్మ) సంబురాలు రానే వచ్చాయి. దీంతో గ్రామాలు సందడిగా మారాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకునే బతుకమ్మ సంబరాల్లో భాగంగా తీరొక్క పూలతో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పేర్చి రోజుకో నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మ సంబరాలు దుమ్ముగూడెం మండలంలో మొదటిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో అట్టహాసంగా ముగుస్తాయి.