News September 17, 2024

JK ఎన్నికల పోటీలో 40% ఇండిపెండెంట్లు.. BJP వ్యూహమా!

image

జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 365 మంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగారు. 90 స్థానాల్లో మొత్తం 908 అభ్యర్థులు పోటీ చేస్తుండగా అందులో స్వతంత్రులే 40% ఉన్నారు. ప్రతి సెగ్మెంట్లో డివిజన్ల వారీగా కశ్మీర్లో ఐదుగురు, జమ్మూలో 2.93% పోటీలో ఉన్నారు. ఓట్లను చీల్చి గెలిచేందుకు BJP వీళ్లకు స్పాన్సర్ చేస్తోందని NC, PDP, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో 831 మంది పోటీచేయగా అందులో 274 మంది ఇండిపెండెంట్లు.

Similar News

News January 5, 2026

శివ మానస పూజ చేద్దామా?

image

మూర్తి పూజ కన్నా మానస పూజ ఎన్నో రెట్లు శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘నా ఆత్మయే శివుడు. నా శరీరమే ఆలయం’ అనే భావనతో శివ మానస పూజ చేస్తారు. బాహ్య వస్తువులతో సంబంధం లేకుండా మదిలోనే శివుడిని ఆరాధించే ఈ ప్రక్రియను ఆదిశంకరాచార్యులు రచించారు. ఈ పూజతో మనసులో చింతలు తొలగుతాయని, శివసాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చని పండితులు చెబుతారు. శివ మానస పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 5, 2026

వరి నారుమడిలో జింకు లోపం నివారణ

image

పెరిగిన చలి కారణంగా ఇప్పటికే పోసిన వరి నారుమళ్లకు జింక్ ధాతువు లభ్యత తగ్గుతుంది. నారుమడిలో జింక్ లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి. అలాగే వరి నారుమడికి పది గ్రాముల 19:19:19 పోషకాన్ని, 2.5 గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజెబ్ మిశ్రమాన్నిలీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

News January 5, 2026

ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తున్నారా?

image

చలికాలంలో పదేపదే ముఖం కడుక్కోవడం వల్ల చర్మానికి ఇబ్బంది కలుగుతుందంటున్నారు నిపుణులు. ప్రతిసారీ సబ్బును వాడటం వల్ల చర్మం.. సహజ నూనెలను కోల్పోతుంది. పీహెచ్‌ స్థాయి తగ్గడంతోపాటు చర్మంపై రక్షణగా ఉండే పొర కూడా బలహీన పడిపోతుంది. దాంతో స్వేదగ్రంథులు మరింత నూనెను ఉత్పత్తి చేస్తూ.. మొటిమలు రావడానికి కారణం అవుతాయి. అలాగే ముఖం ఎక్కువగా కడుక్కోవడం, తుడుచుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది.