News September 17, 2024
విమానాల్లో కన్నడ భాషలోనే మొదటి ప్రకటన చేయాలంటూ ప్రతిపాదన

బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్/టేకాఫ్ అయ్యే ప్రతి విమానంలో మొదటి ప్రకటనను కన్నడలోనే చేయాలని కన్నడ సాహిత్య పరిషత్ కోరింది. ఈ ప్రతిపాదనను సంస్థ ఛైర్మన్ డా.మహేశ్ జోషి సోమవారం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎండీ హరి మరార్ ముందుంచారు. అయితే, దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి తప్పనిసరని, ఆ మేరకు అనుమతి కోసం లేఖ రాస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News January 13, 2026
మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు: సీతక్క

TG: గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరకు దాదాపు రూ.250 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు భారీగా తరలివెళ్తున్నారు.
News January 13, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరు <
News January 13, 2026
కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన మీనాక్షి

తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నటుడు, డాక్టర్ అవ్వకూడదని హీరోయిన్ మీనాక్షి చౌదరీ అన్నారు. అంతేకాకుండా మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచి ఉండకూడదని తెలిపారు. ఎందుకంటే తాను ఇప్పటికే ఆ హోదాల్లో ఉన్నానని చెప్పారు. అయితే తన ఫేవరెట్ డిష్ రాజ్మా 100 ఎకరాల్లో పండించే వ్యక్తి కావాలని తెలిపారు. హైట్ ఉండటంతో పాటు కుకింగ్ తెలిసి ఉండాలన్నారు. కాగా ఆమె నటించిన ‘అనగనగా ఒక రాజు’ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.


