News September 17, 2024
అనంతలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్కు ఘన స్వాగతం

అనంతపురానికి టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం చేరుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన అనంతపురం చేరుకున్న ఆయనకు జిల్లా వాసులు ఘన స్వాగతం పలికారు. ఆయన నేరుగా పట్టణంలోని మాసినేని గ్రాండ్ హోటల్కు వెళ్లారు. సూర్యకుమార్ యాదవ్ను చూసేందుకు క్రికెట్ అభిమానులు బారులు తీరారు.
Similar News
News September 15, 2025
ఇంజినీర్లకు దారి చూపిన గురువు!

అనంతపురం JNTUలో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సుదర్శన రావు ఎంతో మంది యువకులను ఉత్తమ ఇంజినీర్లుగా తీర్చిదిద్దారు. ఆయన గతంలో AEE ఉద్యోగం వదిలేసి టీచింగ్ను ఎంచుకున్నారు. తన అసాధారణమైన బోధనతో ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఆయన స్టూడెంట్స్ AE, AEEలుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇండియాలోని బెస్ట్ టీచర్లలో ఆయన ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
#EngineersDay2025
News September 15, 2025
గుత్తిలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్

గుత్తిలో ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. గౌతమీపురి ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుత్తి ఆర్ఎస్ రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల జట్లు కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 18 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
News September 14, 2025
లోక్సభ ర్యాంకిగ్స్లో అనంతపురం MPకి 8ర్యాంక్

లోక్సభలో MPల పెర్ఫామెన్స్ రిపోర్ట్ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్లు ఇచ్చింది. ఈ నివేదికలో అనంతపురం MP అంబికా లక్ష్మీనారాయణ 8వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 78 ప్రశ్నలు అడగగా, 8 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 89.71గా ఉంది. ఆయన పనితీరుపై మీ కామెంట్..!