News September 18, 2024

రేపు మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ప్రభుత్వం రెండో విడతకు సిద్ధమైంది. రేపు మరో 75 క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ఓపెన్ చేయనున్నారు. మొత్తంగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రాల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కేవలం రూ.5కే అందుతుంది.

Similar News

News November 3, 2025

పెట్టుబడులు రాకుండా YCP కుట్రలు: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా YCP కుట్రలు చేస్తోందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. అన్ని కుట్రలు ఛేదించి సరైన టైమ్‌లో వాస్తవాలను బయటపెడతామన్నారు. ‘అభివృద్ధి కోసం ముందుకొస్తే కలిసికట్టుగా ముందుకెళ్దాం. పెట్టుబడులకు YCP సిఫార్సులను అంగీకరిస్తాం. ఆ పార్టీ సిఫార్సు చేసిన పెట్టుబడులకు వారికే క్రెడిట్ ఇస్తాం. ఎలక్షన్స్ టైమ్‌లోనే రాజకీయాలు.. తర్వాత రాష్ట్రాభివృద్ధే ధ్యేయం’ అని స్పష్టం చేశారు.

News November 3, 2025

‘చక్ దే ఇండియా2’ తీయాలని డిమాండ్.. కారణమిదే

image

18 ఏళ్ల కిందటి ‘చక్ దే ఇండియా’ గుర్తుందా? ప్లేయర్‌గా గెలవని హాకీ వరల్డ్ కప్‌ను కోచ్‌గా కబీర్ ఖాన్(షారుఖ్) సాధించడమే కథ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహిళల WC సాధించడంలో కోచ్ అమోల్ మజుందార్‌‌ది కీలక పాత్ర. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 11 వేల రన్స్ చేసినా ఆయన ఇంటర్నేషనల్ డెబ్యూ చేయలేదు. కోచ్‌గా తన కల నెరవేర్చుకున్న అమోల్ కథతో చక్ దే2 తీయాలని నెటిజన్లు కోరుతున్నారు. మీరేమంటారు?

News November 3, 2025

CII సమ్మిట్‌లో రూ.2లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు: మంత్రి లోకేశ్

image

AP: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ‘సమ్మిట్‌కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. 410కి పైగా ఒప్పందాలు జరగనున్నాయి. వీటి విలువ రూ.2లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఒప్పందాల వల్ల 9లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందుతారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది’ అని ప్రెస్‌మీట్‌లో వివరించారు.