News September 18, 2024
SECగా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్గా గోపాల్

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కమిషనర్గా రిటైర్డ్ IAS రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా విశ్రాంత IAS ఎంజీ గోపాల్ను నియమించింది. ఇద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగనున్నారు. రాణి కుముదిని 1988 IAS బ్యాచ్ కాగా గోపాల్ 1983 IAS బ్యాచ్. వీరిద్దరూ కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా పనిచేశారు.
Similar News
News September 15, 2025
ఆ పూలు పూజకు పనికిరావు!

పువ్వుల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ‘కింద పడిన, వాసన చూసిన, ఎడమ చేతితో కోసిన పువ్వులను పూజకు వాడరాదు. ఎడమ చేత్తో, ధరించిన వస్త్రాలలో, జిల్లేడు/ఆముదం ఆకులలో తీసుకొచ్చిన పువ్వులను కూడా ఊపయోగించకూడదు’ అని చెబుతున్నారు. పూజలో పువ్వులను సమర్పించేటప్పుడు మధ్య వేలు, ఉంగరపు వేలు మాత్రమే వాడాలి’ అని అంటున్నారు.
News September 15, 2025
కార్తెలు అంటే ఏంటి?

జ్యోతిషులు ఉపయోగించే నక్షత్రాల ఆధారంగా.. రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం రూపొందించుకున్న కాలాన్ని ‘కార్తెలు’ అని అంటారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. అలా మృగశిర కార్తె, చిత్త కార్తె, రోహిణి కార్తె.. వంటివి వస్తాయి. ఈ కార్తెలు సుమారుగా 13-14 రోజులు ఉంటాయి. వీటిని ఉపయోగించి రైతులు వాతావరణ మార్పులను అంచనా వేస్తారు. వ్యవసాయ పనులు చేసుకుంటారు.
News September 15, 2025
పూజ గది శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

పండితుల సూచనల మేరకు.. పూజ గదిని శనివారం శుభ్రం చేయడం ద్వారా అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది వీలు కాకపోతే ఏకాదశి (లేదా) గురువారం రోజున శుభ్రం చేసుకోవచ్చు. శుభ్రం చేశాక పూజ గదిలో గంగాజలం చల్లడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీపాలను కూడా నీటితో శుభ్రం చేయాలి. దేవుళ్ల విగ్రహాలు, చిత్రపటాలను నేలపై పెట్టకూడదు. తెల్లటి, శుభ్రమైన గుడ్డపై ఉంచాలి. ఈ నియమాలతో శుభాలు కలుగుతాయి.