News September 18, 2024

అమరావతి రైల్వే లైన్ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు?

image

AP: అమరావతి కొత్త రైల్వే లైన్ కోసం 510 ఎకరాల భూమి అవసరమని రైల్వే శాఖ గుర్తించింది. NTR జిల్లాలో 296, గుంటూరులో 155, ఖమ్మంలో 60 ఎకరాల చొప్పున కావాలని ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపింది. ఈ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయాన్ని భరించేందుకు రైల్వే శాఖ అంగీకరించినట్లు, పాత అలైన్‌మెంట్ ప్రకారం ఎర్రుపాలెం నుంచి రైల్వే లైన్‌ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 1, 2026

దేశ పురోగతికి ఆరు సూత్రాలు

image

ప్రపంచ పరిణామాలను అందిపుచ్చుకొంటూ దేశం మరింత ముందుకు సాగేలా కేంద్రం బడ్జెట్లో ఆరు సూత్రాలను ప్రకటించింది.
1. వ్యూహాత్మక రంగాల్లో మాన్యుఫ్యాక్చరింగ్‌ పెంచడం
2. పారిశ్రామిక వారసత్వ పునరుద్ధరణ
3. MSMEలను ఛాంపియన్లుగా మార్చడం
4 మౌలిక సదుపాయాలకు మరింత ప్రోత్సాహం
5 దీర్ఘకాలిక స్థిర భద్రతను కల్పించడం
6 సిటీ ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధి.

News February 1, 2026

ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<>ICSIL<<>>)8 డేటా ఎంట్రీ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇంటర్వ్యూకు ఒక రోజు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in

News February 1, 2026

పచ్చిపాలను ఇలా వాడితే..

image

* పచ్చి పాలు, తేనె కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్‌తో శుభ్రం చేసుకోవాలి. కొద్ది సేపటికి చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * పచ్చి పాలలో అరటి పండును కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. దీని కోసం కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.