News September 18, 2024
రైల్లో ఫుడ్ డెలివరీ.. మరిన్ని స్టేషన్లలో ‘జొమాటో’ సేవలు

రైలు ప్రయాణికులకు ZOMATO తన సేవలను విస్తరించింది. ట్రైన్లో ఉండగా ఫుడ్ ఆర్డర్ చేస్తే సీట్ల వద్దకే డెలివరీ చేస్తోంది. 2023లో 5 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 స్టేషన్లలో అందిస్తోంది. ఇప్పటివరకు 10లక్షల ఆర్డర్లు డెలివరీ చేసింది. వెయిటింగ్ ప్యాసింజర్లకూ ఈ సేవలను అందిస్తోంది. ప్రయాణికులు తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్ను ఆర్డర్ చేయవచ్చు.
Similar News
News January 26, 2026
అబార్షన్ల మాఫియాపై ఈ నంబర్కు ఫిర్యాదు చెప్పండి: కలెక్టర్

బాలికల పట్ల వివక్ష తగదని, జిల్లాలో బాలికల నిష్పత్తి తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తూ తగిన చర్యలు తీసుకోవడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. అందుకు సంబంధించిన ప్రచారపత్రాలను పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లోని హెల్త్ స్టాల్ వద్ద ఆవిష్కరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడం నేరమని, అలాంటి వారి గురించి 63000 30940 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు.
News January 26, 2026
వేసవి ఉల్లి సాగుకు సూచనలు

వేసవి పంట కోసం ఉల్లిని సాగు చేయాలనుకుంటే ఈ నెలలోనే సిద్ధమవ్వాలి. పంట కొరకు ముందుగా నారును పెంచుకోవాలి. నారుమడి కోసం నేలను దున్ని 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 15 సెంటీ మీటర్ల ఎత్తు గల 10 మళ్లను తయారు చేసుకోవాలి. ఒక కిలో విత్తనానికి కాప్టాన్ లేదా థైరమ్ను 3గ్రా. లేదా ట్రైకోడెర్మావిరిడె 4 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
News January 26, 2026
భారతీయత ఉట్టిపడేలా ఉర్సులా జాకెట్

భారత సంప్రదాయం ఉట్టిపడేలా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ప్యాంటుసూట్స్లో కనిపించే ఆమె తాజాగా బనారసీ జాకెట్ను ధరించారు. గోల్డ్, మెరూన్ రంగులో ఉన్న ఈ దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఉర్సులా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం అని ట్వీట్ చేశారు.


