News September 18, 2024

NZB: ఈ నెల 19న సర్టిఫికేట్ పరిశీలన

image

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో మిగిలిన PGCRT, CRT, PETలతో పాటు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో CRT ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు NZB జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు deonizamabad.in వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాతాలో పేరున్న అభ్యర్థులు ఈ నెల 19న కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయానికి సర్టిఫికేట్ పరిశీలనకు రావాలన్నారు.

Similar News

News October 3, 2024

బిక్కనూర్: భార్య పుట్టింటి నుంచి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌కి చెందిన గంధం కేశయ్య (40) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల కేశయ్య తన భార్య, కుతూరుతో గొడవపడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన భార్యా కాపురానికి రాకపోవటంతో మనస్థాపం చెందిన కేశయ్య.. గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రామచందర్ నాయక్ తెలిపారు.

News October 3, 2024

కామారెడ్డిలో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 133 మంది హాజరు

image

డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 133 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. నిన్న అమావాస్య కావడంతో తక్కువ మంది ధ్రువపత్రాల పరిశీలకు వచ్చినట్లు సిబ్బంది వెల్లడించారు. అలాగే ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని అధికారులు సూచించారు.

News October 3, 2024

నిజామాబాద్: కృష్ణా EXPRESSకి 50 ఏళ్లు

image

కృష్ణా EXPRESSకి 50 ఏళ్లు పూర్తయ్యాయి. అక్టోబరు 2, 1974లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకి డీజిల్ ఇంజిన్‌తో లాంఛనంగా ప్రారంభించారు. ఇరు ప్రాంతాల మధ్య కృష్ణా నది ఉండటం వల్లే దానికి ‘కృష్ణాఎక్స్‌ప్రెస్’ అనే పేరును పెట్టారు. అప్పట్లో పగటిపూట నడిచే మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్ రైలు ఇదే. ప్రస్తుతం ADB నుంచి NZB మీదుగా TPT వరకు నడుస్తోంది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో మీకున్న అనుబంధం ఎలాంటిదో కామెంట్ చేయండి.