News September 18, 2024
ఒత్తిడితో నలిగిపోతున్నారు!

ఉద్యోగం ఉంటేనే గుర్తింపు, గౌరవం ఉంటుందనే భావనలో యువత ఉంది. దీంతో చాలామంది ఎంత స్ట్రెస్ ఉన్నా ఉద్యోగజీవితాన్ని లాక్కొస్తున్నారు. జీవితమంటే కేవలం ఉద్యోగమేనన్నట్టు భావిస్తున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి పట్టించుకోవట్లేదు. మెంటల్ ప్రెషర్ పెరగడంతో వారికి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. తాజాగా 26ఏళ్ల CA ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. కంపెనీలు కూడా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించాలి.
Similar News
News September 15, 2025
GSTని తగ్గించిన కేంద్రం.. ప్రీమియం పెంచేస్తున్న కంపెనీలు!

కేంద్రప్రభుత్వం బీమా ప్రీమియంపై జీఎస్టీని 18% నుంచి సున్నాకు తగ్గించినా ప్రజలకు ఆ మేర లబ్ధి చేకూరట్లేదు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 3 నుంచి 5 శాతం వరకు ప్రీమియాన్ని పెంచేశాయి. సెప్టెంబర్ 16 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తన కంపెనీ ప్రకటించినట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీంతో ప్రజలకు జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాలు అందట్లేదు. అంతిమంగా 13% వరకే ఆదా కానున్నాయి.
News September 15, 2025
వెంటనే రూ.10వేల కోట్లు విడుదల చేయండి: సబిత

TG: విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని BRS నేత సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు బకాయి పడ్డ రూ.10వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయండి. మేము కరోనా సమయంలో ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా నిధులు ఆపలేదు’ అని ట్వీట్ చేశారు.
News September 15, 2025
షాపుల్లో GST తగ్గింపు బోర్డులు తప్పనిసరి: నిర్మల

GST తగ్గింపుతో 140కోట్ల మందికి ఉపశమనం లభించనుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నైలో జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఈనెల 22 నుంచి పన్ను తగ్గింపు అమలులోకి వస్తుంది. GST తగ్గింపు వివరాలతో అన్ని దుకాణాల్లో బోర్డులు పెట్టాలి. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశాం. 350కి పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అది సరిగ్గా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి’ అని సూచించారు.