News September 18, 2024
ఉమ్మడి NZB జిల్లాలోనే రికార్డ్ స్థాయిలో లడ్డూ వేలం ఎక్కడంటే..?
ఉమ్మడి NZB జిల్లాలోనే కనీవినీ ఎరగని రీతిలో రికార్డ్ స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం జరిగింది. పిట్లంలోని ముకుందర్ రెడ్డి కాలనీ గణపయ్య చేతిలోని లడ్డూ.. ఏకంగా రూ.501,000 లక్షలు పలికింది. పిట్లం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సరిత, సూరత్ రెడ్డి ఈలడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది ఇక్కడి లడ్డూ 3.60 లక్షలు పలికింది. మీ గ్రామాల్లో వినాయక మండపాల్లో వేలం పలికిన లడ్డూ ధరను కామెంట్లో తెలుపండి.
Similar News
News October 3, 2024
NZB: గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం బాసరలో చోటుచేసుకుంది. ఎస్ఐ గణేశ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన దత్తు (45) ఆరునెలల కిందట ఆయన యాసిడ్ తాగాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News October 3, 2024
NZB: ఢిల్లీ పోలీసులమంటూ బెదిరించి.. నిట్టనిలువునా దోచారు!
పోలీసులమని బెదిరించి లక్షలు కాజేసిన ఘటన NZB జిల్లాలో జరిగింది. బాధితుల ప్రకారం.. ‘పోలీసులం మాట్లాడుతున్నాం.. డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో ఉన్నావు.. అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారు’ అని కామారెడ్డికి చెందిన కిషన్ రావుకు ఫోన్ చేశారు. దీంతో భయపడిన బాధితుడు సైబర్ నేరగాళ్ల అకౌంట్కు రూ.9,29,000 బదిలీచేశాడు. మోసమని గ్రహించి 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 3, 2024
NZB: డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 220 మంది హాజరు
డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది.ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 220 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, అభ్యర్థుల మొబైల్ ఫోన్లు, ఈమెయిల్కు సమాచారం వచ్చిన వారు మాత్రమే హాజరుకావాలని అధికారులు సూచించారు.