News September 18, 2024

చిలుకను పట్టిస్తే రూ.10వేలు రివార్డు

image

తమ చిలుక సమాచారమిస్తే రూ.10వేలు రివార్డిస్తామంటూ అయోధ్యలో వెలిసిన పోస్టర్లు ఇంట్రెస్టింగా మారాయి. UP ఫైజాబాద్‌లోని శైలేశ్ కుమార్ ఈ ‘మిట్టూ’ చిలకను పెంచుకుంటున్నారు. 20 రోజుల క్రితం పొరపాటున పంజరం తెరవడంతో ఎగిరిపోయి ఇంటికి తిరిగి రాలేదన్నారు. తెలివైన, చక్కగా శిక్షణ పొందిన మిట్టూ మనుషుల గొంతును అనుకరించేదని, ఇంటికొచ్చిన గెస్టులను పేరుపెట్టి పిలిచేదన్నారు. దాని జాడ తెలీక వారి కుటుంబం వర్రీ అవుతోందట.

Similar News

News February 7, 2026

AI కోసం టెక్‌ దిగ్గజాల ₹58 లక్షల కోట్ల రిస్క్!

image

AI రేసులో గెలవడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ కంపెనీలు 2026లో ఏకంగా $700 బిలియన్లు (సుమారు ₹58 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 60% ఎక్కువ. డేటా సెంటర్లు, చిప్స్ కోసం చేస్తున్న ఈ భారీ పెట్టుబడులు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విపరీతమైన ఖర్చుల వల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్ షేర్లు పడిపోగా.. కంపెనీల ఫ్రీ క్యాష్ ఫ్లో తగ్గి అప్పులు పెరుగుతున్నాయి.

News February 7, 2026

APRకి అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు: చంద్రబాబు

image

AP: ఈ నెల 16న అమరావతికి బిల్ గేట్స్ రానున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘APR 14 నుంచి 2 క్వాంటం కంప్యూటర్లు అమరావతిలో ఆపరేట్ అవుతాయి. అమరావతిలో క్వాంటం టాలెంట్ హబ్ రెడీ అవుతోంది. దాని ద్వారా ఐదేళ్లలో 35లక్షల మంది విద్యార్థులు ట్రైన్ అవుతారు. తిరుపతిని స్పేస్ సిటీగా మార్చేందుకు సహకరించాలని ఇప్పుడే కేంద్రాన్ని కోరాను. వచ్చే 40ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టాం’ అని తెలిపారు.

News February 7, 2026

ప్రీ డయాబెటీస్‌ని ఎలా గుర్తించాలంటే?

image

ప్రీ డ‌యాబెటిస్ అంటే డ‌యాబెటిస్‌కి ముందు స్టేజి. వీరిలో ర‌క్తంలో చక్కెర స్థాయిలు మ‌రీ అధికంగా ఉండ‌వు కానీ కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. దీన్ని ప‌ట్టించుకోక‌పోతే డ‌యాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి సాధార‌ణంగా వైద్యులు మందుల‌ను ఇవ్వ‌రు. కొన్నిరోజుల పాటు డైట్, వ్యాయామం చేయాల‌ని సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.