News September 18, 2024

BREAKING: 2050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

TG: 2050 నర్సింగ్ ఆఫీసర్స్(స్టాఫ్ నర్స్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 17న CBT విధానంలో పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి రూ.36,750-1,06,990 పేస్కేల్ విధానంలో జీతం చెల్లిస్తారు. GNM లేదా బీఎస్సీ(నర్సింగ్) అర్హత ఉన్న 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు. పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News November 4, 2025

ఫ్రీగా త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. ఇలా అప్లై

image

AP: దివ్యాంగులకు ఉచితంగా 1,750 త్రీవీలర్ <<18191488>>మోటార్ సైకిళ్లు<<>> అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
>అర్హతలు
*రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, కనీసం 10th పాసై స్వయం ఉపాధి
*18-45 ఏళ్ల లోపు వయసు. 70% అంగవైకల్యం
*డ్రైవింగ్ లైసెన్స్
> దరఖాస్తులకు లాస్ట్ డేట్ నవంబర్ 25. సైట్ <>www.apdascac.ap.gov.in<<>>

News November 4, 2025

ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో 55 ఉద్యోగాలు

image

ఎయిమ్స్ <>గోరఖ్‌పూర్<<>> 55 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు NMC/MCIలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు నవంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. అప్లికేషన్ ఫామ్‌పై ట్రాన్సాక్షన్ నంబర్ రాయాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్‌సైట్:https://aiimsgorakhpur.edu.in

News November 4, 2025

మనవరాలు, తల్లి, తాత.. ముగ్గురూ మృతి

image

TG: నిన్న మీర్జాగూడ <<18183262>>బస్సు<<>> ప్రమాదంలో మరణించిన తల్లీకూతుళ్ల ఫొటో గుండెలను పిండేసిన విషయం తెలిసిందే. తాండూరుకు చెందిన ఖాలీద్.. తన 40 రోజుల మనవరాలికి నామకరణం చేసేందుకు రెండు రోజుల క్రితం HYD నుంచి తీసుకొచ్చారు. అత్తారింట్లో దిగబెట్టేందుకు బస్సులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. తల్లి సలేహ బిడ్డకు హాని జరగకుండా పొత్తిళ్లలో గట్టిగా హత్తుకున్నా ప్రాణాలు దక్కలేదు. ఆ ప్రమాదంలో ఖాలీద్ కూడా చనిపోయారు.