News September 19, 2024
ప్రకాశం జిల్లా విద్యార్థులకు గమనిక

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తు గడువును ఈనెల 24 వరకు పొడిగించినట్లు ప్రకాశం జిల్లా డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు కట్టాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాటిని ప్రింట్ తీసుకుని ఈనెల 27వ తేదీలోగా డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.
Similar News
News December 29, 2025
ప్రకాశం: నేటి కార్యక్రమం రద్దు

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.
News December 28, 2025
రేపు ప్రకాశం ఎస్పీ మీ కోసం కార్యక్రమం రద్దు

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.
News December 28, 2025
ప్రకాశం జిల్లాకు వచ్చిన హీరోయిన్ శ్రీలీల

ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లికి ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల వచ్చారు. తన తాత స్వగ్రామమైన కెల్లంపల్లిలోని శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తాత నివాసానికి వెళ్లి శ్రీలీల కొంతసేపు కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సినీ నటి శ్రీలీల గ్రామానికి రావడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది.


