News September 19, 2024
చరణ్- బుచ్చిబాబు.. మరో ‘రంగస్థలం’ కానుందా?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ కథను బుచ్చిబాబు నాలుగేళ్ల పాటు రాశారు. త్వరలో మూవీ స్టార్ట్ చేయనుండటంతో మూవీ కాస్ట్ను డైరెక్టర్ సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా టీమ్లోకి ‘తంగలాన్’ డ్రెస్ డిజైనర్ ఏకాంబరంను తీసుకున్నారు. ఈయనను తీసుకున్నారంటే ‘రంగస్థలం’లాంటి నేటివ్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News September 12, 2025
ప్రధాని మోదీ మణిపుర్ పర్యటన ఖరారు

PM మోదీ ఈనెల 13 నుంచి 15 వరకు 5 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మిజోరం, మణిపుర్, అస్సాం, వెస్ట్ బెంగాల్, బిహార్లో 3 రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మొత్తం రూ.71,850 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. బిహార్లో మఖానా బోర్డు లాంచ్ చేస్తారు. బిహార్లో రూ.36,000 కోట్లు, మిజోరంలో రూ.9,000 కోట్లు, మణిపుర్లో రూ.8,500 కోట్లు, అస్సాంలో రూ.18,350 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
News September 12, 2025
మహిళలూ వీటి గురించి తెలుసుకోండి

ప్రస్తుతకాలంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరిగింది. వచ్చే జీతం నుంచి సంపదని సృష్టించడం నేర్చుకోవాలి. సిప్, మ్యూచువల్ ఫండ్స్ గురించి బ్యాంకుకు వెళ్లి అడిగితే వాళ్లే వివరాలిస్తారు. గోల్డ్ బాండ్స్ కొని చూడండి. కొంతకాలానికి వడ్డీ వస్తుంది. ఆరోగ్య, జీవిత బీమాలు తీసుకోండి. భవిష్యత్తుకు తగ్గట్లు ప్రణాళికలు, ఉద్యోగంలో ఎదిగే అవకాశాలు చూడాలి. ప్రస్తుత ఉద్యోగం కాకుండా మరో ఆదాయ వనరు గురించీ ఆలోచించాలి.
News September 12, 2025
ఈ ఓటీటీలోనే ‘మిరాయ్’ స్ట్రీమింగ్

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ నటించిన పాన్ ఇండియా ఫాంటసీ చిత్రం ‘మిరాయ్’ OTT హక్కులను జియో హాట్స్టార్ దక్కించుకుంది. 6 నుంచి 8 వారాల థియేటర్ స్క్రీనింగ్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండనుందని ‘మిరాయ్’ మూవీ ఎండ్ కార్డులో ప్రకటించారు. ‘జైత్రయ’ అనే టైటిల్ను వెల్లడించగా ఇందులో నటుడు రానా విలన్గా నటిస్తారని టాక్ వినిపిస్తోంది.