News September 19, 2024
విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదన

TG: ప్రస్తుతం ఇళ్లకు 200యూనిట్లలోపు ఉచిత విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. 300 యూనిట్లు దాటితే కిలోవాట్కు స్థిరఛార్జీని ₹10 నుంచి ₹50కి పెంచాలని డిస్కంలు ERCకి ప్రతిపాదించాయి. ఆ కేటగిరీలో 20%లోపే ప్రజలు ఉన్నందున అంతగా ప్రభావం పడదని అంచనా. పరిశ్రమలకు సంబంధించి 11KVకి యూనిట్కు ₹7.65, 33KVకి ₹7.15, 132KVకి ₹6.65 వసూలు చేస్తుండగా, ఇకపై అన్ని కేటగిరీలకు ₹7.65చొప్పున వసూలుకు అనుమతించాలని కోరాయి.
Similar News
News October 28, 2025
బాలీవుడ్ నటుడి మంచి మనసు

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మంచి మనసు చాటుకున్నారు. ‘రామాయణ’ సినిమాకు తాను తీసుకుంటున్న పారితోషికాన్ని క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి వినియోగించనున్నట్లు వెల్లడించారు. హాలీవుడ్ మాస్టర్ పీస్ చిత్రాలకు భారత్ నుంచి సమాధానంగా ‘రామాయణ’ నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంకొన్ని రోజులు తన పాత్ర షూట్ మిగిలి ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
News October 28, 2025
ఇంట్లో కాలుష్యానికి వీటితో చెక్

ప్రస్తుతకాలంలో కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం కష్టంగా మారింది. ఆరుబయటే కాదు ఇంట్లో కూడా కాలుష్యం విస్తరిస్తోంది. దీన్ని తగ్గించాలంటే ఇంట్లో కొన్నిమొక్కలు పెంచాలంటున్నారు నిపుణులు. బోస్టన్ ఫెర్న్, స్పైడర్ ప్లాంట్, వీపింగ్ ఫిగ్, పీస్ లిల్లీ, ఇంగ్లిష్ ఐవీ మొక్కలు గాలిని శుభ్రం చేయడంలో సహాయం చేస్తాయి. గాలి కాలుష్యాన్ని తొలగించి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయంటున్నారు.
News October 28, 2025
శివుడి కోసం సతీదేవి ఏం చేసిందంటే..?

సతీదేవికి శివునిపై ఉన్న ప్రేమను, భర్త గౌరవం పట్ల ఆమెకున్న నిబద్ధతను దక్షయజ్ఞ ఘట్టం మనకు నిరూపిస్తుంది. శివుడిని దక్షుడు అవమానించడం ఆమె సహించలేకపోయింది. శివుని ఔదార్యాన్ని వివరించి, దక్షుడి అహంకారాన్ని ఖండించింది. శివునిపై ద్వేషం పెంచుకున్న తండ్రి నుంచి వచ్చిన ఈ శరీరం శివుని అవమానంతో కలుషితమైందని భావించింది. అందుకే, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి యోగాగ్ని ద్వారా దేహత్యాగం చేసింది. <<-se>>#Shakthipeetham<<>>


