News September 19, 2024
యువ CA మృతిపై కేంద్రం విచారణ

ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్(26) <<14129191>>మృతిపై <<>>కేంద్రం విచారణ మొదలుపెట్టింది. తన కూతురు ఆఫీస్లో అదనపు పని ఒత్తిడి వల్లే చనిపోయిందని ఆమె తల్లి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పని ప్రదేశాల్లో అసురక్షిత వాతావరణం, శ్రమ దోపిడీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో BJP నేత రాజీవ్ చంద్రశేఖర్ కేంద్రం జోక్యాన్ని డిమాండ్ చేయడంతో కేంద్ర కార్మికశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది.
Similar News
News February 1, 2026
ఆస్ట్రేలియాతో సిరీస్.. క్లీన్స్వీప్ చేసిన పాక్

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లోనూ పాకిస్థాన్ 111 పరుగుల తేడాతో విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 96 రన్స్కే ఆలౌటైంది. దీంతో మూడు టీ20ల సిరీస్ను పాక్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన పాక్ ప్లేయర్ బాబర్.. T20Iలలో అత్యధిక అర్ధ శతకాలు(39) చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ క్రమంలో కోహ్లీ(38) రికార్డును బద్దలుకొట్టారు.
News February 1, 2026
KCRతో కేటీఆర్, హరీశ్ రావు భేటీ

TG: సిట్ విచారణ అనంతరం BRS అధినేత KCRతో కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు సహా లాయర్లు భేటీ అయ్యారు. విచారణ జరిగిన తీరు, అధికారుల ప్రశ్నల సరళిపై చర్చిస్తున్నారు. తర్వాత పరిణామాలపై డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు BRS భవన్కు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు KCR రాకకోసం వేచిచూస్తున్నారు.
News February 1, 2026
సెమీస్కు భారత్! పాక్ గెలిచినా ఇంటికే..

U19 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా సెమీస్కు దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని <<19023246>>33.3<<>> ఓవర్లలోపు ఛేదించడంలో పాక్ విఫలమైంది. ఆ సమయానికి కేవలం 167/4 రన్స్ మాత్రమే చేయడంతో రన్రేట్ సమీకరణాల ప్రకారం భారత్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. పాకిస్థాన్ జట్టు గెలుపు కోసం పోరాడుతోంది. ఈ మ్యాచ్ పాక్ గెలిస్తే ఇండియా ఎల్లుండి ఆసీస్తో, ఓడితే FEB 4న ఆఫ్గాన్తో సెమీఫైనల్లో తలపడనుంది.


