News September 19, 2024

ALERT: గోధుమ పిండి వాడుతున్నారా?

image

ఉత్తర్‌ప్రదేశ్‌లో వందల కిలోల నకిలీ గోధుమ పిండిని అధికారులు గుర్తించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇంట్లోనే నకిలీ పిండిని గుర్తించవచ్చు. మొదట ప్లేట్‌లో కొద్దిగా పిండి తీసుకోండి > అందులో నిమ్మరసం వేయండి.. నీటి బుడగలు వస్తే అది కల్తీది. గ్లాసు నీటిలో పిండిని వేసి కలపండి. పిండి నీటిపై తేలితే అది స్వచ్ఛమైనది కాదని అర్థం. కాస్త పిండిని నోటిలో వేసుకోండి చేదుగా ఉంటే అది కల్తీ అయినట్లే.

Similar News

News September 12, 2025

భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు

image

AP: రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా కిలో రూ.2కి పడిపోయింది. నంద్యాల, మదనపల్లె మార్కెట్లలో రూ.3-రూ.10 వరకు పలికింది. అటు కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు ఉల్లి క్వింటా రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. దీంతో కూలీ ఖర్చులు కూడా రావట్లేదని వాపోయారు.

News September 12, 2025

నేడే లాస్ట్.. టెన్త్ అర్హతతో 515 పోస్టులు

image

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) 515 ఆర్టిసన్ గ్రేడ్ 4 పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. అభ్యర్థులు టెన్త్, ఐటీఐ పాసై 27 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.29,500 నుంచి రూ.65,000 వరకు ఉంటుంది. నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి https://careers.bhel.in/ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 12, 2025

నేడు విజయవాడలో Way2News కాన్‌క్లేవ్

image

AP: విజయవాడలో ఇవాళ Way2News కాన్‌క్లేవ్ నిర్వహించనుంది. CM చంద్రబాబుతో పాటు కేంద్ర‌మంత్రి రామ్మోహన్ నాయుడు, MPలు భరత్, హరీశ్ బాలయోగి పాల్గొననున్నారు. YCP నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం కాన్‌క్లేవ్‌కు హాజరుకానున్నారు. రానున్న పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందనే వివిధ అంశాలపై వీరు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. మ.12గంటల నుంచి యాప్‌లో LIVE వీక్షించొచ్చు.