News September 19, 2024
రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమం
AP: రేపటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం గ్రామంలో పర్యటించనున్నారు.
Similar News
News September 20, 2024
Learning English: Synonyms
✒ Gross: Improper, Rude, Coarse
✒ Happy: Pleased, Contented
✒ Hate: Despise, Loathe, Abhor
✒ Have: Acquire, Gain, Maintain
✒ Help: Aid, Assist, Succor
✒ Hide: Conceal, Shroud, Veil
✒ Hurry: Hasten, Urge, Accelerate
✒ Hurt: Distress, Afflict, Pain
✒ Idea: Thought, Concept, Notion
News September 20, 2024
బీజేపీ ఎంపీ రఘునందన్పై హైకోర్టు ఆగ్రహం
TG: మెదక్ BJP MP రఘునందన్రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారని ఓ న్యాయమూర్తి సీజేకు లేఖ రాశారు. ఆయన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ లేఖను సుమోటోగా తీసుకున్న ధర్మాసనం రఘునందన్కు నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశించింది.
News September 20, 2024
మాతృత్వంతో ఆనందం, ఆందోళన: అలియా భట్
తల్లి అయిన తర్వాత టైమ్ మేనేజ్మెంట్ సాధ్యం కావట్లేదని హీరోయిన్ అలియా భట్ చెప్పారు. తనకంటూ సమయం వెచ్చించలేకపోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మాతృత్వం ఆనందంగానే ఉన్నా ఆందోళన కూడా ఉందన్నారు. కూతురు రాహా అల్లరి, చిలిపి పిల్ల అని మురిసిపోయారు. 2022 నవంబర్లో బిడ్డకు జన్మనిచ్చిన అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 11న ఇది విడుదల కానుంది.