News September 19, 2024

వరదల తర్వాత అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయింది: VSR

image

AP: విజయవాడ వరదల తర్వాత రాజధాని అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుడమేరు వరదలు, అమరావతి భవిష్యత్‌పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఒకరి కల కోసం రాష్ట్రానికి కోట్లు ఖర్చు చేసే స్థోమత లేదు. పెట్టుబడి దారుల విశ్వాసం సన్నగిల్లింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 10, 2025

సిద్ధార్థ్ మాల్యాతో అందుకే బ్రేకప్: దీపికా పదుకొణె

image

తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ మాల్యాతో బ్రేకప్‌పై హీరోయిన్ దీపికా పదుకొణె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘సిద్ధార్థ్ బిహేవియర్ దారుణంగా ఉంటుంది. మేం ఇద్దరం కలిసి చివరిసారిగా డిన్నర్‌కు వెళ్లినప్పుడు నన్ను బిల్ పే చేయమన్నాడు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అతడితో రిలేషన్ కొనసాగించడానికి నాకు ఒక్క ఆప్షన్ కూడా కనిపించలేదు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రణ్‌వీర్‌ను దీపిక పెళ్లాడారు.

News September 10, 2025

అగ్రికల్చర్ వర్సిటీలో PG, PhDలో ప్రవేశాలు

image

<>ఆచార్య<<>> NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ PG, PhDలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 18వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో SEP 22వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్&టెక్నాలజీ విభాగంలో ఉన్నాయి. వెబ్‌సైట్:https://angrau.ac.in/

News September 10, 2025

బిడ్డకు జన్మనిచ్చిన మెగా కపుల్

image

టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్ నుంచి ఆస్పత్రికి వెళ్లి వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు. మెగా ఫ్యాన్స్ వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తేజ్-లావణ్య వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే.