News September 19, 2024

శ్రీకాకుళం వైసీపీ అధ్యక్షునిగా ధర్మాన కృష్ణదాస్

image

మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.యస్.జగన్ తాడేపల్లిలోని ఆపార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై చర్చించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ అధ్యక్షులుగా తమ్మినేని సీతారాం ని ప్రకటించారు. వారికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News January 13, 2026

మాజీ మంత్రి సతీమణి లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం

image

దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవిని ఓదార్చారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వివాహాన్ని తానే దగ్గరుండి చేయించానన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని బావోధ్వేగానికి గురయ్యారు.

News January 13, 2026

కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించండి మహాప్రభో…!

image

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, భామిని మండలాలలో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల కారణంగా తమ పంట పొలాలకు రక్షణ లేకుండా పోయిందని, ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం లభించడం లేదని ఆ ప్రాంత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితి తీవ్రతని గమనించి, శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించి, అడవి ఏనుగుల్ని తమ ప్రాంతం నుండి ఒడిశా సరిహద్దులలోకి తరిమివేయాలని వారు కోరుతున్నారు.

News January 13, 2026

శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

image

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.