News September 19, 2024
నంద్యాల: సీఎం సహాయ నిధికి రూ.2.22 కోట్ల విరాళం
శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు అందించిన విరాళాలు రూ.2,22,70,749ను సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు. మంగళగిరిలో సీఎం చంద్రబాబుకు ఈ మొత్తాన్ని అందజేశారు. నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, వ్యాపారవేత్తలు, పొదుపు మహిళలు, విద్యార్థులు అందించిన మొత్తం సొమ్మును లెక్క చూపి ఆయనకు అందజేశారు. ప్రజలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News September 20, 2024
15 శాతం వృద్ధిరేటు సాధించాలి: కలెక్టర్
కర్నూలు జిల్లాలో రానున్న కాలంలో అన్ని రంగాల్లో దాదాపుగా 15% వృద్ధిరేటు సాధించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం వంద రోజుల ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర @2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లా, మండల స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య విధానం, తదితర వాటిలో అభివృద్ధి ప్రణాళికలు ఉండాలన్నారు.
News September 20, 2024
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా హ్యాండ్ బాల్ జట్లు
ఈనెల 20, 21వ తేదీల్లో కడప జిల్లా వేంపల్లిలో జరిగే 38వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ జట్లను హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధి చిన్న సుంకన్న ప్రకటించారు. గురువారం కర్నూలు డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టుకు ఎంపికైన హ్యాండ్ బాల్ సబ్ జూనియర్స్ క్రీడాకారులకు టీషర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయవాది శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.
News September 19, 2024
కర్నూలు నుంచి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించండి: మంత్రి టీజీ భరత్
కర్నూలు నుంచి విజయవాడ జంక్షన్కు రైలు సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమణ్ణను భరత్ కలిసి రైల్వే సమస్యలపై వినతిపత్రం అందించారు. కర్నూలు నుంచి విజయవాడకు ప్రతి రోజూ రైలు, కర్నూలు నుంచి ముంబైకి వారంలో ఒకటి లేదా రెండు సార్లు రైలు సౌకర్యం కల్పించాలని కోరారు.