News September 19, 2024
అక్టోబర్ 22న ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ రీ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మూవీ రీ రిలీజ్కు సిద్ధమైంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 22న ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దశరథ్ తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. దిల్ రాజు నిర్మించారు. 2011లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.
Similar News
News November 6, 2025
రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్: ఫతి

TG: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కాలేజీలు మూతబడి 4 రోజులు అవుతోంది. రూ.10వేల కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిల్లో రూ.5వేల కోట్లు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని ‘ఫతి’ స్పష్టం చేసింది. మిగతా రూ.5వేల కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలంది. అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని.. అందుకే బంద్కు దిగాల్సి వచ్చిందని పేర్కొంది.
News November 6, 2025
ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.
News November 6, 2025
5,346 టీచర్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలో 5,346 <


