News September 20, 2024

జనసేనలోకి తోట త్రిమూర్తులు?

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేనలో చేరే అవకాశం ఉంది. తన సంబంధీకుడైన సామినేని ఉదయభాను ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. జనసేన పెద్దల వద్ద సామినేని ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, కూటమిలో మూడు పార్టీలకు ఆమోదమైతేనే చేర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గత వారం YS జగన్ పిఠాపురంలో పర్యటించినప్పుడూ తోట దూరంగా ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

Similar News

News November 14, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ ఒకేరోజు రెండు సార్లు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ ఉదయం రూ.770 తగ్గగా తాజాగా రూ.810 దిగివచ్చింది. దీంతో రూ.1,27,040కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర ఉదయం రూ.700 తగ్గగా ఇప్పుడు రూ.750 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,16,450గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై 100 తగ్గి రూ.1,83,100కు చేరింది.

News November 14, 2025

తేజస్వీ విజయం.. తేజ్ ప్రతాప్ పరాజయం

image

బిహార్ ఎన్నికల్లో మహా కూటమి CM అభ్యర్థి, RJD నేత తేజస్వీ యాదవ్ గెలిచారు. రాఘోపూర్ నియోజకవర్గంలో BJP నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు మహువా నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్(-51,938 ఓట్లు) మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. రామ్‌విలాస్ అభ్యర్థి సంజయ్ కుమార్ సింఘ్ 44 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రెండో స్థానంలో RJD అభ్యర్థి ముకేశ్ కుమార్ నిలిచారు.

News November 14, 2025

CII: 2 రోజుల్లోనే ₹7.15 లక్షల కోట్ల పెట్టుబడులు

image

AP: విశాఖలో నిర్వహిస్తున్న CII సదస్సు మంచి ఫలితాలిస్తోంది. నిన్న, ఇవాళ కలిపి ₹7,14,780 CR పెట్టుబడులపై 75 MOUలు జరిగాయి. వీటి ద్వారా 5,42,361 ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
* తొలి రోజు సదస్సులో మొత్తంగా 40 కంపెనీలతో ₹3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. వీటి ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం.
* నిన్న 35 ఒప్పందాల ద్వారా ₹3,65,304 కోట్ల పెట్టుబడులు. వీటితో 1,26,471 ఉద్యోగాలు.