News September 20, 2024
జనసేనలోకి తోట త్రిమూర్తులు?

AP: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేనలో చేరే అవకాశం ఉంది. తన సంబంధీకుడైన సామినేని ఉదయభాను ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. జనసేన పెద్దల వద్ద సామినేని ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, కూటమిలో మూడు పార్టీలకు ఆమోదమైతేనే చేర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గత వారం YS జగన్ పిఠాపురంలో పర్యటించినప్పుడూ తోట దూరంగా ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
Similar News
News January 14, 2026
మిడిల్ ఈస్ట్లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ హెచ్చరికతో..

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తమ దేశంపై అమెరికా స్ట్రైక్ చేస్తే మిడిల్ ఈస్ట్లోని US మిలిటరీ బేస్లపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఖతర్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి తమ సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలిచింది. ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కాగా మిడిల్ ఈస్ట్లో USకు ఇదే అతిపెద్ద మిలిటరీ బేస్. ఇందులో 10వేలకు పైగా అమెరికా సైనికులు ఉంటారు.
News January 14, 2026
ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్: నథింగ్ CEO

స్మార్ట్ ఫోన్ల ధరలు ఈ ఏడాది 30% లేదా అంతకంటే ఎక్కువే పెరగొచ్చని నథింగ్ కంపెనీ CEO కార్ల్ పై అంచనా వేశారు. ఒకవేళ ధరలు పెంచకపోతే స్పెసిఫికేషన్స్ను తగ్గించాల్సి వస్తుందన్నారు. మెమరీ, డిస్ ప్లే ధరలు కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చాయని, ఇప్పుడు మెమరీ ధరలు 3 రెట్లు పెరిగాయని చెప్పారు. AI వల్ల స్మార్ట్ ఫోన్లలో వాడే మెమరీ చిప్స్కు డిమాండ్ ఏర్పడిందని, నథింగ్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్ల ధరలు పెరుగుతాయన్నారు.
News January 14, 2026
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ సర్వీసులు నడపాలి: MLA

AP: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభమైనా విశాఖ నుంచి కొన్ని డొమెస్టిక్ విమాన సర్వీసులకైనా అవకాశమివ్వాలని MLA విష్ణుకుమార్ రాజు కోరారు. ‘VSP నుంచి ఏటా 30L మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. భోగాపురం చేరాలంటే 2 గంటల సమయం, ట్యాక్సీలకు ₹4500 వరకు ఖర్చు అవుతుంది. విజయవాడకు వందేభారత్ ట్రైన్లో 4 గంటల్లో చేరుకోవచ్చు. అదే భోగాపురం నుంచి విమానంలో వెళ్లాలంటే 6గంటలు పడుతుంది. ఖర్చూ ఎక్కువే’ అని పేర్కొన్నారు.


