News September 20, 2024
తిరుమల లడ్డూపై రిపోర్టు.. ఈ సందర్భాల్లో తప్పు అయ్యే ఛాన్స్: NDDB
AP: తిరుమల లడ్డూలో జంతువుల నూనెలు వాడారంటూ వైరలవుతున్న NDDB-CALF రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ‘ఈ రిపోర్టు కొన్నిసార్లు తప్పు అయ్యే అవకాశం ఉంది. వెజిటబుల్ ఆయిల్స్ అధికంగా ఉండే మేతను ఆవులకు ఎక్కువగా ఇవ్వడం/తక్కువ ఆహారం పెట్టడం/పాలలోని కొలెస్ట్రాల్ను తొలగించడం, ఇతర టెక్నికల్ అంశాల వల్ల ఫలితాలు తప్పుగా రావొచ్చు’ అని రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిపింది.
Similar News
News September 20, 2024
ఆ కేంద్రమంత్రి తల తెచ్చిన వారికి నా ఆస్తి రాసిస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే
TG: రాహుల్ గాంధీ నంబర్ వన్ ఉగ్రవాది అంటూ కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు చేసిన ఆరోపణలపై ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. బిట్టు తల నరికి తెచ్చినవారికి తన ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని రాసిస్తానని ప్రకటించారు. బిట్టుపై బీజేపీ కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు బిట్టుపై కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో బెంగళూరులో కేసు నమోదైంది.
News September 20, 2024
నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్
AP: ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది. ఉ.10.30-మ.12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో, మ.12-సా.6 వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్ చేసుకునేలా పోర్టల్ను రూపొందించారు. అయితే 24 గంటలూ బుకింగ్కు అవకాశం ఉండాలని CM చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు.
News September 20, 2024
ఇసుక ఆన్లైన్ బుకింగ్ ఇలా
✒ <
✒ ఆ తర్వాత జనరల్ కన్జ్యూమర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
✒ మెయిల్ ఐడీ, చిరునామా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఖరారవుతుంది.
✒ ఆ తర్వాత నిర్మాణ వివరాలు నమోదు చేయాలి. పేమెంట్ పూర్తిచేశాక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది.