News September 20, 2024
నేటి నుంచి ఐసెట్ చివరి దశ కౌన్సెలింగ్

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన టీజీఐసెట్-2024 లాస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ నేడు ప్రారంభం కానుంది. ఈరోజే సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రేపు పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 22న ఫ్రీజింగ్ చేసుకోవాలి. 25వ తేదీలోపు సీట్ల కేటాయింపు ఉంటుంది. 25, 27 తేదీల్లో ఫీజు చెల్లించి 28వ తేదీలోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి.
Similar News
News March 11, 2025
FLASH: గ్రూప్-2 ఫలితాలు విడుదల

TG: గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ <
News March 11, 2025
సంతాన ప్రాప్తి కోసం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కత్రినా?

కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సందర్శించారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక నాగపూజలో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అయితే, సంతాన ప్రాప్తి కోసం ఈ పూజ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. సర్పాలకు అధిపతి అయిన కార్తికేయుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకుంటున్నారు. సంతాన ప్రాప్తికోసం, ఇతర సర్ప దోషాల నివారణకు అనేకమంది ఇక్కడికి వెళ్తుంటారు.
News March 11, 2025
ఆడబిడ్డలను మోసగిస్తే తాటతీస్తాం: చంద్రబాబు

AP: హత్యా రాజకీయాల మరక అంటకుండా 42 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని CM చంద్రబాబు తెలిపారు. నేరాలు – ఘోరాలు చేసి రాజకీయాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కొందరు ఆడబిడ్డలను మాయమాటలతో మోసగిస్తున్నారని, వారి తాటతీస్తామని హెచ్చరించారు. ఆకతాయిలు వేధిస్తుంటే ‘శక్తి’ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వైసీపీ తీసుకొచ్చిన దిశ యాప్ దిక్కుమాలిన యాప్ అని మండిపడ్డారు.