News September 20, 2024

‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన’

image

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా చేపడుతున్న ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 25, 2025

42 మందితో విజయనగరం టీడీపీ పార్లమెంటరీ వర్గం

image

విజయనగరం జిల్లా పార్లమెంటరీ కార్యవర్గాన్ని టీడీపీ ప్రకటించింన సంగతి తెలిసిందే. ఇందులో 42 మందికి స్థానం కల్పించింది. ఇందులో తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులను, కార్యదర్శులకు అవకాశమిచ్చింది. మొత్తంగా 13 మంది మహిళలకు స్థానం లభించింది. కాగా నూతన కార్యవర్గంలో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.

News December 25, 2025

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: VZM SP

image

సైబర్, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డులను ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు. అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైల్స్, క్యూఆర్ కోడ్స్ ఓపెన్ చేయవద్దన్నారు. నకిలీ కాల్స్ చేసి సీబీఐ, ఈడీ, సీఐడీ అధికారులమంటూ బెదిరించే వారిని నమ్మవద్దు అన్నారు.

News December 25, 2025

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: VZM SP

image

సైబర్, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డులను ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు. అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైల్స్, క్యూఆర్ కోడ్స్ ఓపెన్ చేయవద్దన్నారు. నకిలీ కాల్స్ చేసి సీబీఐ, ఈడీ, సీఐడీ అధికారులమంటూ బెదిరించే వారిని నమ్మవద్దు అన్నారు.