News September 20, 2024

కాంగ్రెస్‌కే మొగ్గు.. బీజేపీకి ఎదురుగాలే: కేకే

image

AP ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన ‘కేకే సర్వేస్’ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సర్వే చేసింది. హరియాణాలో INCకే విజయావకాశాలు ఉన్నాయని, BJPకి ఎదురుగాలి వీస్తోందని ఆ సంస్థ MD కిరణ్ కొండేటి తెలిపారు. OCT 5న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న J&K, త్వరలో ఎలక్షన్స్ జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీలోనూ కమలం పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

Similar News

News September 20, 2024

80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్ పోటీల్లో!

image

నైపుణ్యం సాధించేందుకు వయసుతో పని లేదనే విషయాన్ని గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల స్విమ్మర్ బకుల పటేల్ నిరూపించారు. 13 ఏళ్లకే పెళ్లవడం, పిల్లలు యుక్తవయసులో ఉండగానే భర్తను కోల్పోవడంతో ఆమె ఒంటరైపోయారు. భయాన్ని పోగొట్టేందుకు పటేల్ ఈతను ఎంచుకున్నారు. 58 ఏళ్ల వయసులో నదిలో మునిగి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా పట్టుదలతో ఈతలో ప్రావీణ్యం పొందారు. ఇప్పటికే 9 అంతర్జాతీయ విజయాలు సహా 530+ పతకాలు సొంతం చేసుకున్నారు.

News September 20, 2024

నందిగం సురేశ్ ఇంట్లో సోదాలు

image

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పోలీసు కస్టడీలో ఆయన వెల్లడించిన సమాచారం ఆధారంగా గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన ఆయనకు కోర్టు తాజాగా మరో 14 రోజులు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.

News September 20, 2024

లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ: నేడే తొలి మ్యాచ్

image

మాజీ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాళ్టి నుంచి జరగనుంది. నేడు తొలి మ్యాచులో రాత్రి 7 గంటలకు కోణార్క్ సూర్యాస్, మణిపాల్ టైగర్స్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ధవన్, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ తదితర మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, ఫ్యాన్ కోడ్ యాప్‌లో ఈ మ్యాచులను చూడవచ్చు.