News September 20, 2024
నేడు సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ

ఓటుకు నోటు కేసును నేడు సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని BRS MLA జగదీశ్రెడ్డితో పాటు మరికొందరు నేతలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్పై ఈరోజు జస్టిస్ బీఆర్.గవాయ్, జస్టిస్ కేవీ.విశ్వనాథన్ల ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది.
Similar News
News November 12, 2025
విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటమార్చారు. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.
News November 12, 2025
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఉద్యోగాలు

ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<
News November 12, 2025
టమాటాలో శిలీంద్రం ఎండు తెగులును ఎలా నివారించాలి?

శిలీంద్రం ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పొలం నుంచి పీకి దూరంగా కాల్చేయాలి. పంటకు సరిపడినంత నీటి తడులు అందించాలి. ఎక్కువగా నీరు పెట్టకూడదు. తెగులు సోకిన మొక్కలను తొలగించిన నేలను.. లీటరు నీటికి మాంకోజెబ్ 3గ్రాములు కలిపి బాగా తడపాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ ఉన్న మొక్కల వద్ద కూడా ఈ ద్రావణంతో నేలను బాగా తడపాలి. ట్రైకోడెర్మావిరిడేని వేపపిండి, పశువుల ఎరువుతో కలిపి నాటేముందు పొలంలో చల్లుకోవాలి.


