News September 20, 2024

బెంగాల్ X ఝార్ఖండ్: సరిహద్దు మూసేసిన మమత

image

ఝార్ఖండ్ సరిహద్దును మూసేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) వల్ల 5 లక్షల క్యూసెక్కుల వరద సౌత్ బెంగాల్లోని 11 జిల్లాలను ముంచేసిందని ఆమె ఆరోపించారు. DVC ఎప్పుడూ ఝార్ఖండ్ గురించే ఆలోచిస్తోందని, దాంతో సంబంధాలు తెంపుకుంటున్నామని ప్రకటించారు. ‘ఆమెదో విపరీత చర్య. బెంగాల్‌కు ధాన్యం తెచ్చే ట్రక్కులను మేమూ ఆపేస్తాం’ అని JMM హెచ్చరించింది.

Similar News

News September 20, 2024

ఉప్పరపల్లి కోర్టుకు జానీ

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి జానీని పోలీసులు విచారించారు.

News September 20, 2024

CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

image

చార్టెర్డ్ అకౌంటెన్సీ (CA)-2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 12, 14, 16, 18 తేదీల్లో ఫౌండేషన్ కోర్స్ ఎగ్జామ్స్ ఉంటాయని ICAI ప్రకటించింది. జనవరి 11, 13, 15 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-1, జనవరి 17, 19, 21 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్ కోర్సుల పరీక్షలు మ.2 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వివరించింది.

News September 20, 2024

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాథోడ్

image

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ టీమ్ బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్‌ను నియమించింది. ఆయన ఇటీవల భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేశారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ఇప్పటికే ప్రధాన కోచ్ బాధ్యతలు రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించింది. తాజాగా రాథోడ్‌ను సైతం నియమించుకుంది. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంలో వీరిద్దరూ తెర వెనుక కీలకపాత్ర పోషించారు.