News September 20, 2024
సిద్దరామయ్య X గవర్నర్: ముడా కేసులో మరో ట్విస్ట్
కర్ణాటక CM సిద్దరామయ్యపై అన్ని డాక్యుమెంట్లు సహా డీటెయిల్డ్ రిపోర్టు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ షాలినీ రజనీశ్ను గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆదేశించారు. KUDA చట్టానికి విరుద్ధంగా తన నియోజకవర్గం వరుణ, శ్రీరంగపట్నలో రూ.387 కోట్ల పనులు చేపట్టాలని MUDAను మౌఖికంగా ఆదేశించారని సీఎంపై గవర్నర్ వద్ద మరో పిటిషన్ దాఖలైంది. అధికార దుర్వినియోగంపై CBIతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరడంతో గవర్నర్ స్పందించారు.
Similar News
News September 20, 2024
YCPకి సామినేని ఉదయభాను రాజీనామా
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, సరైన గుర్తింపు రాలేదని సామినేని అన్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా ఎల్లుండి ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.
News September 20, 2024
100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం: వైసీపీ
AP: కూటమి ప్రభుత్వం గత 100 రోజుల్లో ప్రజలకు చేసింది ‘సున్నా’ అని వైసీపీ విమర్శించింది. ‘సూపర్-6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది. దాడులు, దౌర్జన్యాలతో కక్షసాధింపులకే పరిమితం అయింది. ఈ 100 రోజుల్లో 50 మందికి పైగా ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం రావణకాష్ఠంగా మారింది. మంచి ప్రభుత్వమంటూ ప్రచారం తప్ప ఈ 100 రోజుల్లో ప్రజలకు ఒరిగిందేమిటి?’ అని ట్వీట్ చేసింది.
News September 20, 2024
టీటీడీ ఈవోకు చంద్రబాబు ఆదేశం
AP: టీటీడీలో నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.