News September 20, 2024
రేగోడు తహశీల్దార్ SUSPEND

రేగోడు తహశీల్దార్ బాలలక్ష్మిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాహుల్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీఓ రమాదేవి తహశీల్దార్ ఆఫీస్ను ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆ సమయంలో ఎమ్మార్వో అందుబాటులో లేరు. దీంతో అక్కడికి వచ్చిన రైతులతో ఆర్డీఓ మాట్లాడారు. తహశీల్దార్ నిత్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, బాధ్యతలపై నిర్లక్ష్యంగా ఉన్నారని రైతులు తెలిపారు. దీంతో తహశీల్దార్ని సస్పెండ్ చేశామని ఆర్డీవో తెలిపారు.
Similar News
News December 30, 2025
BIG BREAKING: మెదక్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు మెదక్ జిల్లాలోని నర్సాపూర్, రామాయంపేట, మెదక్, తూప్రాన్ మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. SHARE IT
News December 30, 2025
జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకం: మెదక్ అదనపు కలెక్టర్

పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకమని అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ అన్నారు. సమాచార హక్కు చట్టం-2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కులు గురించి వివరంగా తెలియజేశారు. పౌర సమాచార అధికారులు (PIO), సహాయ PIOలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలన్నారు.
News December 30, 2025
నర్సాపూర్: తండ్రిని పొడిచిన కొడుకుకు ఏడేళ్ల జైలు శిక్ష

నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో ఆస్తి పంపకం చేయాలని తండ్రి దశరథను కత్తితో పొడిచిన కొడుకు నాగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి సుభావల్లి తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు తెలిపారు. నేరస్థుడికి శిక్షపడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


