News September 20, 2024
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రమేశ్
తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఈ సంఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
Similar News
News September 20, 2024
మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: ఎండీ
విశాఖ జిల్లాలో మంజూరైన ప్రతి ఇంటిని అధికారులు దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గృహ నిర్మాణాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులకు కాంట్రాక్టర్లకు అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసి మయూర్ అశోక్ పాల్గొన్నారు.
News September 20, 2024
వైసీపీని రద్దు చేయాలని కోరుతాం: గంటా
జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదని, వైసీపీని రద్దు చేస్తే దేశానికి మంచిదని ఎలక్షన్ కమిషన్ను కోరనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.ఆనందపురంలో శుక్రవారం జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదమైన లడ్డూలో జంతువు కొవ్వు అవశేషాలున్నట్టు తేలడంతో హిందూ సమాజం నివ్వెర పోయిందన్నారు.
News September 20, 2024
విశాఖ: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ‘మోకా’కు చోటు
మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. విశాఖకు చెందిన విజయ్ కుమార్ చిరుధాన్యాలతో చిత్రాలను, బొమ్మలను తయారుచేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల మిల్లెట్స్తో తయారు చేసిన సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని అమరావతిలో అయనకు బహూకరించారు. వివిధ చోట్ల జరిగిన జీ- 20 సదస్సులో ఆయన తయారుచేసిన మిల్లెట్ చిత్రాలు ప్రదర్శించారు.