News September 20, 2024
చంద్రబాబు హిందూ జాతికి క్షమాపణలు చెప్పాలి: భూమన

AP: తిరుమల లడ్డూను వాడుకుని రాజకీయం చేద్దామనుకున్నCM చంద్రబాబు ప్రయత్నాలు బెడిసికొట్టాయని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తక్షణమే CM హిందూ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘లడ్డూలో ఎడిబుల్ ఆయిల్ వాడుతున్నట్లు TTD EO శ్యామలరావు ప్రకటించారు. ఫేక్ రిపోర్టుతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News January 8, 2026
అమెరికా నియమాలను ఉల్లంఘిస్తోంది: ఫ్రాన్స్ అధ్యక్షుడు

అమెరికా విదేశాంగ విధానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ ఖండించారు. ‘US క్రమంగా దాని మిత్రదేశాల్లో కొన్నింటి నుంచి దూరం జరుగుతోంది. ఇంతకాలం అది ప్రోత్సహిస్తూ వచ్చిన అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తోంది. కొత్త వలసవాదం, సామ్రాజ్యవాదాన్ని ఫ్రాన్స్ తిరస్కరిస్తుంది’ అని మేక్రాన్ చెప్పారు. ప్రపంచం దోపిడీదారుల డెన్లా మారే ప్రమాదం ఉందని ఫ్రాంక్ వాల్టర్ అన్నారు.
News January 8, 2026
అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

AP: RTC అద్దె బస్సుల యజమానులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సమ్మె నోటీసులిచ్చారు. బస్సు అద్దె పెంచాలని అందులో డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్త్రీశక్తితో అధిక రద్దీ వల్ల భారం పడుతోందని, అదనంగా నెలకు రూ.15-20వేల వరకు ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 2,500 వరకు అద్దె బస్సులుండగా, సమ్మెకు దిగితే సంక్రాంతి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
News January 8, 2026
అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్ను అమెరికా నిన్న <<18791945>>స్వాధీనం<<>> చేసుకున్న విషయం తెలిసిందే. అందులోని 28 మంది సిబ్బందిలో ముగ్గురు ఇండియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. 17మంది ఉక్రేనియన్లు, ఆరుగురు జార్జియా పౌరులు, ఇద్దరు రష్యన్లు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ US నిర్బంధించింది. సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని, విదేశీయులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని రష్యా డిమాండ్ చేసింది.


