News September 20, 2024
నెవర్ బిఫోర్ స్థాయికి దేశీయ స్టాక్ మార్కెట్లు
దలాల్ స్ట్రీట్లో బుల్ రంకెలేసింది. గ్లోబల్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్తో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 1,359 పాయింట్ల లాభంతో 84,544 వద్ద, నిఫ్టీ 375 పాయింట్ల లాభంతో 25,790 వద్ద స్థిరపడ్డాయి. దీంతో BSE నమోదిత సంస్థల ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లకు చేరింది. PSU రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభాలు గడించాయి.
Similar News
News September 20, 2024
తిరుమల ప్రసాదం కల్తీ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు
తిరుమల ప్రసాదం కల్తీ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మేల్కొంది. హిందూ ధార్మిక వ్యవహారాలు పర్యవేక్షించే ముజ్రాయ్ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఇక నుంచి పూజలకు, దీపాలకు, అన్న ప్రసాదాలకు నందిని నెయ్యి మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని 1.80 లక్షల ఆలయాల్లో 35,500 ఆలయాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి.
News September 20, 2024
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్కు రంగం సిద్ధమైంది. ఎల్లుండి హైదరాబాద్లోని నోవాటెల్ HICCలో ఈవెంట్ జరుగుతుందని మూవీ టీమ్ ట్విటర్లో ప్రకటించింది. ‘భయమంటే ధైర్యం ఉన్నవారి కోసమే కాదు, అదో వేడుక కూడా. పెద్ద పండుగకు తొలి అడుగు 22న పడుతోంది. మాస్ జాతరను కలిసి స్వాగతిద్దాం’ అని పోస్ట్ చేసింది. సినిమా ఈ నెల 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
News September 20, 2024
సీఎం తమ్ముడు, బావమరిదికే అన్ని కాంట్రాక్టులు: కేటీఆర్
TG: రాష్ట్రంలో అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, తోఖన్ సాహూకు లేఖ రాశారు. అర్హతలు లేకున్నా CMరేవంత్ తమ్ముడు, బావమరిదికే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. టెండర్ల సమాచారాన్ని ప్రభుత్వం తొక్కిపెడుతోందని విమర్శించారు. దీనిపై స్పందించకుంటే కాంగ్రెస్ అవినీతిలో కేంద్రం వాటా ఉందని ప్రజలు నమ్ముతారు’ అని ఆయన పేర్కొన్నారు.