News September 20, 2024
ప్చ్.. మళ్లీ తక్కువ రన్స్కే ఔటైన రోహిత్
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 6 పరుగులు చేసిన హిట్మ్యాన్ రెండో ఇన్నింగ్స్లో 5 రన్స్కే పెవిలియన్ చేరారు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో జాకీర్ హసన్కు క్యాచ్ ఇచ్చి అందరినీ నిరాశ పరిచారు. కాగా చిన్న జట్టుపై తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో రోహిత్కు ఏమైందంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News September 20, 2024
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం
TG: హైదరాబాద్లో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ‘మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకూ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనలు సడలించాం. అవసరమైన 169 మంది అధికారులు, 964 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్పై రప్పిస్తున్నాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
News September 20, 2024
ఇది ముంచిన ప్రభుత్వం: అంబటి
AP: కూటమి సర్కార్ 100 రోజుల పాలనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘వంద రోజుల పాలనలో ఏమున్నది గర్వకారణం. పథకాల ఎగవేతలు. పరపార్టీపై నిందలు. రెడ్ బుక్ పీడనలు. ఇది ముంచిన ప్రభుత్వం’ అని విమర్శించారు.
News September 20, 2024
తిరుమల ప్రసాదం కల్తీ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు
తిరుమల ప్రసాదం కల్తీ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మేల్కొంది. హిందూ ధార్మిక వ్యవహారాలు పర్యవేక్షించే ముజ్రాయ్ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఇక నుంచి పూజలకు, దీపాలకు, అన్న ప్రసాదాలకు నందిని నెయ్యి మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని 1.80 లక్షల ఆలయాల్లో 35,500 ఆలయాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి.