News September 20, 2024
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News September 21, 2024
కొత్త స్టడి: మందు బాటిల్పై కేలరీల లేబుల్తో సేవించే మోతాదు తగ్గిస్తారు!
బాటిల్పై కేలరీల లేబుల్ ఉంచితే మందుబాబులు మద్యం సేవించే మోతాదును తగ్గించుకొనే అవకాశం ఉందని ఇంగ్లండ్లో జరిపిన ఓ అధ్యయనం తేల్చింది. 4,684 మంది పెద్దలపై UCL పరిశోధకులు అధ్యయనం జరిపారు. దీని ప్రకారం బాటిళ్లపై కేలరీల లేబుల్లను జోడిస్తే, సగం కంటే ఎక్కువ మంది మద్యం ప్రియులు తమ మద్యపాన అలవాట్లను మార్చుకుంటారని కనుగొన్నారు. సేవించే మోతాదు ఎంతున్నా తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారన్నారు.
News September 20, 2024
దిగ్గజాల సరసన యశస్వీ జైస్వాల్
భారత క్రికెటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించారు. తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్గా రికార్డు నెలకొల్పారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ 10 టెస్టుల్లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్క్ టేలర్(1,088)ను అధిగమించారు. ఈ జాబితాలో బ్రాడ్మన్(1,446) అగ్ర స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఎవర్టన్ వీక్స్(1,125), జార్జ్ హెడ్లీ(1,102) కొనసాగుతున్నారు.
News September 20, 2024
కల్తీ నెయ్యి ఘటన.. దేవాదాయశాఖ అప్రమత్తం
AP: తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది. దీనిపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేసే యోచనలో దేవదాయశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.