News September 20, 2024

నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయింది: మోదీ

image

విదేశీ గ‌డ్డ‌పై దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. నేటి కాంగ్రెస్‌లో దేశ‌భ‌క్తి స్ఫూర్తి చ‌చ్చిపోయింద‌ని ఆయన మండిపడ్డారు. ‘పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ల భాష, దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే మాట‌ల‌ను చూడండి. ఇది ‘తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బ‌న్ న‌క్స‌ల్స్ న‌డుపుతున్న కాంగ్రెస్’ అంటూ ప్ర‌ధాని మండిప‌డ్డారు. మ‌హారాష్ట్ర‌లోని వార్ధ సభలో ఆయ‌న‌ మాట్లాడారు.

Similar News

News September 21, 2024

అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు: నాదెండ్ల

image

AP: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పంట నష్టం, తడిసిన ధాన్యానికి సంబంధించి విధివిధానాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన రూ.1700 కోట్లను తాము చెల్లించామని పేర్కొన్నారు.

News September 21, 2024

BJP స్టిక్కర్ అన్ని నేరాల నుంచి రక్షిస్తుంది: కాంగ్రెస్ ధ్వ‌జం

image

గురుగ్రామ్‌లో రాంగ్ రూట్‌లో వెళ్తున్న ఓ కారు వ్య‌క్తి మృతికి కార‌ణ‌మ‌వ్వ‌డంపై BJPని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ ఘ‌ట‌న‌లో బైక‌ర్ మృతికి కార‌ణ‌మైన కారు డ్రైవ‌ర్‌కు ఒక్క రోజులోనే బెయిల్ మంజూరైంది. అత‌ని కారుపై BJP స్టిక్క‌ర్ ఉండ‌డమే దీనికి కారణమనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ స్టిక‌ర్ అన్ని నేరాల నుంచి ర‌క్షిస్తుందంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇది బీజేపీ జంగిల్ రూల్ అంటూ మండిప‌డింది.

News September 21, 2024

సచివాలయ ఉద్యోగుల బదిలీలపై కీలక ఆదేశాలు

image

AP: సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22తో బదిలీల ప్రక్రియ గడువు ముగియనుంది. అయితే ఈ నెల 20 నుంచి 26 వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని సర్కార్ చేపడుతోంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి 100 రోజుల ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఉద్యోగులను వారి స్థానాల నుంచి రిలీవ్ చేయొద్దని కలెక్టర్లను GOVT ఆదేశించింది.