News September 20, 2024
బుమ్రా @ది వరల్డ్ క్లాస్ ప్లేయర్!
చెన్నై వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పడగొట్టిన నాలుగు వికెట్లు బంగ్లాను తక్కువ మొత్తానికే ఆలౌట్ చేసేందుకు తోడ్పడ్డాయి. సొంతగడ్డపై బుమ్రా ఇప్పటివరకు 9 టెస్టులు ఆడగా 15.94 సగటు& 32.4 స్ట్రైక్ రేట్తో 37 వికెట్లు తీశారు. ప్రపంచ క్రికెట్లో బుమ్రా అత్యుత్తమ ఆటగాడని మరోసారి నిరూపించాడని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
Similar News
News September 21, 2024
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు: నాదెండ్ల
AP: ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పంట నష్టం, తడిసిన ధాన్యానికి సంబంధించి విధివిధానాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన రూ.1700 కోట్లను తాము చెల్లించామని పేర్కొన్నారు.
News September 21, 2024
BJP స్టిక్కర్ అన్ని నేరాల నుంచి రక్షిస్తుంది: కాంగ్రెస్ ధ్వజం
గురుగ్రామ్లో రాంగ్ రూట్లో వెళ్తున్న ఓ కారు వ్యక్తి మృతికి కారణమవ్వడంపై BJPని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ ఘటనలో బైకర్ మృతికి కారణమైన కారు డ్రైవర్కు ఒక్క రోజులోనే బెయిల్ మంజూరైంది. అతని కారుపై BJP స్టిక్కర్ ఉండడమే దీనికి కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ స్టికర్ అన్ని నేరాల నుంచి రక్షిస్తుందంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇది బీజేపీ జంగిల్ రూల్ అంటూ మండిపడింది.
News September 21, 2024
సచివాలయ ఉద్యోగుల బదిలీలపై కీలక ఆదేశాలు
AP: సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22తో బదిలీల ప్రక్రియ గడువు ముగియనుంది. అయితే ఈ నెల 20 నుంచి 26 వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని సర్కార్ చేపడుతోంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి 100 రోజుల ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఉద్యోగులను వారి స్థానాల నుంచి రిలీవ్ చేయొద్దని కలెక్టర్లను GOVT ఆదేశించింది.