News September 21, 2024

NLG: కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు!

image

నూతన రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,07,259 రేషన్ కార్డులున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో వేలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వారి కల నెరవేరబోతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 21, 2024

మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌గా ఎంపికైన సిద్దిసముద్రంతండా వాసి

image

తిరుమలగిరి మండలం సిద్ది సముద్రం తండాకు చెందిన ధరావత్ సాయిప్రకాష్ శుక్రవారం ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పంజాబ్ రాష్ట్రానికి ఎంపికయ్యాడు. సాయి ప్రకాష్ చిన్నతనం నుంచే చదువులో ముందు ఉండేవాడు. ఇంటర్ పూర్తికాగానే హైదరాబాద్లోని సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. దీంతో తండావాసులు సాయి ప్రకాష్ కు అభినందనలు తెలిపారు.

News September 20, 2024

శ్రీశైలం జలాశయం సొరంగాన్ని సందర్శించిన మంత్రుల బృందం

image

శ్రీశైలం జలాశయం నుండి 40 కి.మీ భూగర్భ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ దిగువన నిర్మించబడిన సొరంగాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి 30 టీఎంసీల నీటిని ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకొస్తుందని తెలిపారు.

News September 20, 2024

సూర్యాపేట: గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

సూర్యాపేట జిల్లా యాతవాకిళ్లలో ముస్లిం దంపతులు షేక్ దస్తగిరి – సైదాబీ మత సామరస్యం చాటుకున్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలోని శ్రీ గణేశ్ మహారాజ్ లడ్డూని రూ.29,000 వేలకు కైవసం చేసుకున్నారు. భారీ ఊరిగేంపుతో లడ్డూను దస్తగిరి ఇంటికి తరలించారు. దస్తగిరి – సైదాబీ దంపతులను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.