News September 21, 2024
లంకాధిపతి ఎవరో? నేడే అధ్యక్ష ఎన్నిక
ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడి కోలుకుంటున్న శ్రీలంకలో ఇవాళ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 13,421 పోలింగ్ కేంద్రాల్లో 1.7 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా సిట్టింగ్ ప్రెసిడెంట్ రణిల్ విక్రమ సింఘే(యునైటెడ్ నేషనల్ పార్టీ), ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస(బలవేగాయ పార్టీ), కుమార దిస్సనాయకే(నేషనల్ పీపుల్స్ పవర్) మధ్యే పోటీ ఉండనుంది.
Similar News
News September 21, 2024
HYDలో ఇళ్ల అమ్మకాలు ఢమాల్!
HYDలో జూలై-సెప్టెంబర్ మధ్య ఇళ్ల అమ్మకాల్లో సుమారు 42% క్షీణత నమోదవుతుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. గతేడాది ఇదే సమయంలో 20,658 యూనిట్ల విక్రయం జరగ్గా ఈసారి 12,082 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, నవీ ముంబై మినహా 9 ప్రధాన పట్టణాల్లో 18% తగ్గుముఖం పట్టినట్లు వివరించింది.
News September 21, 2024
‘నందిని’ ఆవు నెయ్యి గురించి తెలుసా?
దేశంలో అమూల్ తర్వాత అతిపెద్ద మిల్క్ కార్పొరేషన్గా ‘నందిని మిల్క్’ బ్రాండ్కు మంచి గుర్తింపు ఉంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన Karnataka Cooperative Milk Producers’ Federation Limited ‘నందిని’ బ్రాండ్ పేరుతో పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పన్నీర్, చీజ్, బటర్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తుంది. స్వచ్ఛమైన ఆవు పాలతో నెయ్యిని తయారుచేస్తారు. దీనికి AGMARK సర్టిఫికెట్ కూడా ఉంది.
News September 21, 2024
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
AP: ఎంఎన్సీ కంపెనీల మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొస్తోంది. మెక్డోవెల్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ల మద్యం నిన్న రాష్ట్రానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను త్వరలోనే తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్రాండ్లు త్వరలోనే వస్తాయన్నారు.