News September 21, 2024
HYDలో ఇళ్ల అమ్మకాలు ఢమాల్!
HYDలో జూలై-సెప్టెంబర్ మధ్య ఇళ్ల అమ్మకాల్లో సుమారు 42% క్షీణత నమోదవుతుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. గతేడాది ఇదే సమయంలో 20,658 యూనిట్ల విక్రయం జరగ్గా ఈసారి 12,082 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, నవీ ముంబై మినహా 9 ప్రధాన పట్టణాల్లో 18% తగ్గుముఖం పట్టినట్లు వివరించింది.
Similar News
News September 21, 2024
మోదీ పర్యటనకు ముందు ఖలిస్థానీలతో US NSA మీటింగ్
చరిత్రలో తొలిసారి సిక్కు యాక్టివిస్టులు, వేర్పాటువాదుల(ఖలిస్థానీ)తో అమెరికా NSA సమావేశం అయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ముంగిట వైట్హౌస్ అధికారులు వారిని కలవడం గమనార్హం. అమెరికా గడ్డపై విదేశీ దూకుడు చర్యల నుంచి రక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు సిక్కు నేత ప్రిత్పాల్ సింగ్ అన్నారు. ‘నిరంతర నిఘాతో సిక్కుల ప్రాణాల్ని కాపాడిన ఫెడరల్ గవర్నమెంటుకు థాంక్స్’ అని ఆయన ట్వీట్ చేశారు.
News September 21, 2024
ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపు
Jr.NTR ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్పై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే రిలీజ్ రోజున(SEP 27) 12AM నుంచి మొత్తం 6షోలు, 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News September 21, 2024
జానీ మాస్టర్ను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్!
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్పై పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టును కోరనున్నారు. మరోవైపు జానీపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ కోసం అతడి తరఫు న్యాయవాది పిటిషన్ వేయనున్నారు.