News September 21, 2024
రాష్ట్రంలో పరువు హత్య
AP: అన్యమతస్థుడిని పెళ్లి చేసుకున్న కూతురిని పేరెంట్స్ హతమార్చిన ఘటన నెల్లూరు(D) పద్మనాభునిసత్రంలో జరిగింది. రమణయ్య, దేవసేనమ్మల చిన్నకూతురు శ్రావణి(24) భర్తతో విడిపోయింది. ఇటీవల రబ్బానీ బాషాను పెళ్లిచేసుకోగా తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి కొట్టడంతో చనిపోయింది. దీంతో ఇంటిపక్కనే పూడ్చిపెట్టారు. 25 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు.
Similar News
News September 21, 2024
జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి: CM చంద్రబాబు
AP: గత ప్రభుత్వం వల్ల తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని CM చంద్రబాబు అన్నారు. ‘లడ్డూ అపవిత్రం కావడంపై లోతుగా విచారణ జరగాలి. రూ.320కే కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది? జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు. అన్ని దేవాలయాల్లో తనిఖీలు చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై పండితులతో చర్చిస్తున్నాం’ అని మీడియాతో చిట్ చాట్లో వ్యాఖ్యానించారు.
News September 21, 2024
కారు యాక్సిడెంట్.. ICUలో నటుడు
బాలీవుడ్ నటుడు పర్విన్ దాబాస్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముంబైలో ఈ ఉదయం అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పర్విన్ ‘మాన్సూన్ వెడ్డింగ్’, ‘మైనే గాంధీ కో నహీ మారా’, ‘ది పర్ఫెక్ట్ హజ్బెండ్’ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లాంటి సినిమాల్లో నటించారు. ‘తమ్ముడు’ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రీతి జింగ్యానీని పర్విన్ 2008లో పెళ్లి చేసుకున్నారు.
News September 21, 2024
చలించిన థరూర్: రోజుకు 8Hrs, వారానికి 5 రోజుల పనికి మద్దతు
రోజుకు 8Hrs, వారానికి 5 రోజుల పనివేళలకు MP శశి థరూర్ మద్దతిచ్చారు. దీంతోపాటు Govt, Pvt కంపెనీల్లో ఫిక్స్డ్ వర్క్ క్యాలెండర్కు చట్టబద్ధత అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానన్నారు. 4 నెలలు వీకాఫ్ లేకుండా రోజుకు 14Hrs పనిచేస్తూ గుండెపోటుతో చనిపోయిన యంగ్ CA అన్నా సెబాస్టియన్ కుటుంబాన్ని పరామర్శించారు. ‘8Hrs మించి పనిచేయిస్తే శిక్షించేలా చట్టం తేవాలి. వర్క్ప్లేస్లో మానవ హక్కులు ఆగకూడద’ని అన్నారు.