News September 21, 2024

లంచ్: భారత్ ఆధిక్యం 432 రన్స్

image

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ 432 రన్స్ ఆధిక్యం సాధించింది. మూడో రోజు లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. క్రీజులో గిల్(86), పంత్(82) ఉన్నారు. వీరిద్దరూ 138 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లా బౌలర్లు లంచ్ వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376, బంగ్లా 149 రన్స్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News September 21, 2024

పవన్‌ను కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి

image

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. రేపు జనసేనలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. రోశయ్యతోపాటు ఆయన వియ్యంకుడు రవిశంకర్ కూడా ఆ పార్టీలో చేరుతున్నారు. కాగా రోశయ్య ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. 2019లో పొన్నూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమిపాలయ్యారు.

News September 21, 2024

జానీ మాస్టర్ భార్య అరెస్ట్‌కు రంగం సిద్ధం?

image

TG: అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఆయన భార్య ఆయేషాను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువతిని ఆయేషా బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

News September 21, 2024

దేశాన్ని విడ‌దీయ‌డానికి రాహుల్ వెనుకాడ‌రు: క‌ంగ‌న‌

image

రాహుల్ గాంధీ అధికారం కోసం దేశాన్ని విడ‌దీయ‌డానికి వెనుకాడ‌బోర‌ని BJP MP కంగ‌నా ర‌నౌత్ విమ‌ర్శించారు. రాహుల్ విదేశాల్లో భార‌త్ గురించి ఎలాంటి విష‌యాలు మాట్లాడుతార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అన్నారు. ‘కొంత మంది ప్రజల్ని వాడుకుంటున్నారు. కొన్ని వ‌ర్గాల్ని రెచ్చ‌గొడుతున్నారు. దేశంపై రాహుల్‌కు ఉన్న భావ‌న‌లు తెలిసిందే. అధికారం కోసం ఆయ‌న దేశాన్ని విడ‌దీయ‌డానికి వెనుకాడ‌రు’ అని కంగన విమ‌ర్శించారు.