News September 21, 2024

ఈనెల 26న OTTలోకి ‘సరిపోదా శనివారం’

image

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈనెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్, విలన్‌గా ఎస్‌జే సూర్య నటించారు.

Similar News

News September 21, 2024

ఆ వివాదంలోకి కెనీషాను లాగొద్దు: జయం రవి

image

తమిళ నటుడు జయం రవి తన భార్యతో విడిపోవడం వెనుక గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రవి తాజాగా స్పందించారు. ‘దయచేసి ఇందులోకి ఎవరి పేరునూ లాగొద్దు. వ్యక్తిగత జీవితాల్ని గౌరవించండి. చాలామంది చాలా అంటున్నారు. కెనీషా 600కు పైగా స్టేజీ షోల్లో పాడిన గాయని. కష్టపడి పైకొచ్చింది. ఆమెను ఈ వివాదంలో దయచేసి ఇన్వాల్వ్ చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు.

News September 21, 2024

ఇగ్నో అడ్మిషన్ల గడువు పొడిగింపు

image

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2024 సెషన్‌కు సంబంధించి అన్ని ఆన్‌లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్‌ల కోసం అడ్మిషన్ల గడువును పొడిగించింది. తాజాగా Sep 30, 2024 వ‌ర‌కు గ‌డువు పెంచింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక పోర్టల్స్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో రెండుసార్లు అడ్మిషన్ల గడువు పెంచారు.

News September 21, 2024

బాబు, లోకేశ్ ప్రమాణానికి సిద్ధమా?: అంబటి

image

AP: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు నిరూపించలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ వ్యవహారంపై తిరుమలలో చంద్రబాబు, లోకేశ్‌కు ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని ఉపయోగించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపాం. కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చింది’ అని అంబటి ఆరోపించారు.