News September 21, 2024

ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపు

image

Jr.NTR ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే రిలీజ్ రోజున(SEP 27) 12AM నుంచి మొత్తం 6షోలు, 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Similar News

News September 21, 2024

ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టీజర్ ఎప్పుడంటే?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ హారర్ కామెడీ మూవీ దాదాపు 50శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సినిమా టీజర్ అక్టోబర్ 23న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసే యోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది.

News September 21, 2024

ప్రసాదంలో కాదు.. చంద్రబాబులోనే కల్తీ: VSR

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని YCP MP విజయసాయిరెడ్డి అన్నారు. కల్తీ అంతా CM చంద్రబాబు బుర్ర, మనసులోనే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘బాబు జీవితంలో ఆరోపణలు తప్ప నిరూపణలు ఉండవు. కలియుగంలో ఆయన చేసిన పాపాలు ఎవరూ చేసి ఉండరు. నీ ప్రవర్తనతో కంసుడు, కీచకుడు సిగ్గు పడేలా చేశావు. నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు ప్రజల దురదృష్టం. ఆ దేవదేవుడు ఎప్పటికీ నిన్ను క్షమించడు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News September 21, 2024

తిరుపతి లడ్డూ వివాదం ఫేక్ కావొచ్చు: TMC ఎంపీ

image

తిరుపతి లడ్డూ వివాదం బీజేపీ వ్యాప్తి చేసిన కల్పితం కావొచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే అనుమానాలు వ్యక్తం చేశారు. ‘బీజేపీ ఎగ్జిట్ పోల్స్ టైమ్‌లో స్టాక్ మార్కెట్ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. దాంతో హెరిటేజ్ షేర్లపై CBN కుటుంబానికి రూ.1200 కోట్ల లాభం వచ్చింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిపై ఆరోపణలు చేసిన సీఎంకు ఓ డెయిరీ రాజ్యం ఉండటం కాకతాళీయమేనా?’ అని సందేహం వ్యక్తం చేశారు.